Sunday, April 28, 2024

AP: మత్స్యకారుడిపై రెండు ఎలుగుబంట్ల దాడి..

నందికొట్కూర్, మార్చి 22 (ప్రభ న్యూస్) : నందికొట్కూర్ నియోజకవర్గ పరిధిలోని పగిడ్యాల మండలం గణపురం వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ లో డి.వెంకటేశ్వర్లు అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లగా.. రెండు ఎలుగుబంట్ల దాడిలో గాయపడ్డ సంఘటన పగిడ్యాల మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.

ప్రాతకోట గ్రామానికి చెందిన దీపగుంతల వెంకటేశ్వర్లు శుక్రవారం చేపల వేటకు వెళ్లాడు. అక్కడే ఉన్న రెండు ఎలుగుబంట్లు అతనిపై దాడి చేయగా.. అతను కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement