Friday, May 17, 2024

Murder : వివేకా కేసులో ట్విస్ట్‌.. సీబీఐ అధికారిపై కేసు న‌మోదు

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తులో వ‌రుస ట్విస్టులు చోటుచేసుకున్నాయి. వివేకా వ‌ద్ద కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన ద‌స్త‌గిరి రెండో ద‌ఫా త‌న వాంగ్మూలాన్ని ఇవ్వ‌గా.. ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని అధికారి రాంసింగ్‌పై ఏకంగా కేసు న‌మోదు అయ్యింది. వివేకా హ‌త్య కేసు ద‌ర్యాప్తులో తాము చెప్పిన‌ట్లుగానే చెప్పాలని రాంసింగ్ బెదిరిస్తున్నార‌ని ఉద‌య్ కుమార్ రెడ్డి అనే వ్య‌క్తి స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా క‌డ‌ప రిమ్స్ స్టేష‌న్‌లో మంగళవారం రాంసింగ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement