మానవ బాంబుగా మారి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని అంతమొందిస్తానని ట్విట్టర్లో హెచ్చరిక పోస్టింగులు పెట్టిన వ్యక్తిని ఎట్టకేలకు సీఐడీ పోలీసులు గుర్తించారు. ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్స్ ఆధ్వర్యంలో నిందితుడిని ఇవ్వాల అరెస్టు చేశారు.
కాగా, నిందితుడు రాజమండ్రికి చెందిన రాజుపాలెపు పవన్ఫణి అనే వ్యక్తి కన్నాభాయ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ పోస్టులు చేసినట్టు పోలీసులు గుర్తించారు.