Thursday, May 2, 2024

శ్రీవారి పుష్కరిణి మరమ్మతుల నిమిత్తం నెల రోజుల పాటు మూసివేత.. ప్ర‌క‌టించిన టీటీడీ

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం పుష్కరిణిని నెల రోజులపాటు మూసివేయాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వ‌చ్చే నెల (ఆగస్టు) 1 నుండి 31వ తేదీ వరకు పుష్క‌రిణిని మూసి వేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పుష్క‌రిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు నెల రోజులపాటు పుష్కరిణి మూసివేయనున్నట్టు వెల్ల‌డించింది. అలాగే మరమ్మతుల కారణంగా నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి ఉండ‌దని టీటీడీ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement