Saturday, April 27, 2024

టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి కుమారుడు మృతి

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్ర‌మౌళి మూడు రోజులు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లిన పెళ్ళికొడుకు గుండెపోటుకు గురై మృతిచెందాడు. దీంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి పుత్రశోకం మిగిల్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి అలియాస్ శివ గుండెపోటుతో చెన్నైలోనే కావేరి ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించారు. వైద్యులు ఈరోజు ఆయన మరణించినట్టు ధ్రువీకరించారు. చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో చంద్రమౌళికి వివాహం ఖాయమైంది. ఇటీవలే నిశ్చితార్థం కూడా అట్టహాసంగా జరిపారు. త్వరలో వీరి వివాహం తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగాల్సి ఉంది. ఇంతలోనే విధి ఆయన్ను బలితీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement