Monday, April 29, 2024

బోండా ఉమా నోరు అదుపులో పెట్టుకో: టీటీడీ పాలక మండలి సభ్యుడు వార్నింగ్

అవినీతికి ఆమడదూరంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని టీటీడీ బోర్డు పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ అన్నారు. పెద్దిరెడ్డి 6 వేల కోట్ల రూపాయలు తినేశారన్న టీడీపీ నేత బోండా ఉమ వ్యాఖ్యాలను ఆయన తీవ్రంగా ఖండించారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు కంచుకోటను బద్దలు కొట్టిన వ్యక్తి పెద్దిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు మతి భ్రమించి చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. టిడిపి జలసమాధి అయిపోయిందన్నారు. బోండా ఉమ తన దగ్గర చిట్ట ఉందని చెప్పాడు విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి 24 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి జీరో చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టుతో మాట్లాడడం సరికాదన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో 13 సీట్లు గెలిపించిన వ్యక్తిని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement