Saturday, May 4, 2024

వేదిక్ వర్సిటీ ఇన్‌చార్జ్‌గా టీటీడీ అదనపు ఈవో.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు

తిరుమల, ప్రభన్యూస్‌ : టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్స్‌లర్‌గా టీటీడీ అదనపు ఈవో ఏవీ .ధర్మారెడ్డిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వీసీ ఆచార్య సుదర్శన శర్మ పదవీకాలం ముగిసినా ఆయనే ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం కొత్త వీసీని నియమించేంత వరకు ధర్మారెడ్డిని ఇన్‌చార్జ్‌ వీసీగా కొనసాగించాలన్న టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఆ మేరకు కొత్త విసిని నియమించేంత వరకు ధర్మారెడ్డి వేదిక్ వర్సిటి ఇన్‌చార్జ్‌గా కొనసాగుతారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement