Tuesday, May 14, 2024

తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై..

తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. నేటి ఉదయం స్వామి వారి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గ‌వ‌ర్న‌ర్ కు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. అనంత‌రం ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.


ద‌ర్శ‌నానంత‌రం ఆలయ వెలుపలకు గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా బాగుండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. బ్రేక్ సమయంలో మార్పు తీసుకురావడం చాలా మంచి నిర్ణయంమన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని ముందు అందరూ సమానమే అంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఆనందదాయకమని కొనియాడారు. తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రిగిన రెండు కార్య‌క్ర‌మాల‌కు త‌న‌కు ఆహ్వానం లేక‌పోవ‌డం వ‌ల్లే హాజ‌రుకాలేక‌పోయిన‌ట్లు మ‌రోసారి గవర్నర్ ప్ర‌స్తావించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement