Monday, April 29, 2024

ఏపీలో అధికారుల బదిలీలు.. సీసీఎల్‌ఏ కార్యదర్శిగా అహ్మద్‌ బాబు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ శనివారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ కార్యాలయంలో బదిలీలు చోటు చేసుకున్నాయి. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ , ఫిషరీస్‌, పశుసంవర్థకశాఖ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ బాబు ఏ భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ స్థానంలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి కేఆర్‌బీహెచ్‌ఎన్‌ చక్రవర్తిని జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

కాగా అహ్మద్‌బాబు ఏపీడీడీసీఎఫ్‌తో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న శాఖలకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా నెల్లూరు జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌ గా పనిచేస్తున్న గుమ్మల గ ణేశ్‌కుమార్‌ భూ పరిపాలన విభాగం జాయింట్‌ సెక్రటరీగా బదిలీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆర్డీవోగా పనిచేస్తున్న పి రచన సీసీఎల్‌ఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (సీఎంఆర్‌ఓ)గా నియమితులయ్యారు. ఆ స్థానంలో పనిచేస్తున్న స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎన్‌ తేజ్‌ భరత్‌ సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీగా ప్రభుత్వం పోస్టింగ్‌ కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement