Monday, April 29, 2024

మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర‌ ప్ర‌భుత్వం..

అమరావతి, ఆంధ్రప్రభ: పురపాలకశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న చీఫ్‌, ఎగ్జిక్యూటివ్‌, సూపరింటెండింగ్‌ ఇంజనీర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ టిడ్కో, ఏపీయూఎఫ్‌ఐడీ, సీఆర్‌డీఏ, జీవీఎంసీ, అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏడీసీఎల్‌) పరిధిలో 37 మంది ఇంజనీరింగ్‌ అధికారులకు స్థానచలనం కలిగింది. సీఆర్‌డీఏ చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎం జక్రయ్యను ఏఐఐబీ టెక్నికల్‌ డైరెక్టర్‌ గా నియమితులయ్యారు.

ఆ స్థానంలో ప్రస్తుతం పనిచేస్తున్న కే రాజేంద్రప్రసాద్‌ ఏడీసీఎల్‌ సీఈగా బదిలీ అయ్యారు. ఏడీసీఎల్‌ ఎస్‌ఈగా పనిచేస్తున్న కే రామ్మోహన్‌రావును విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు అక్కడ పనిచేస్తున్న పీవీకే భాస్కరరావును గుంటూరు కార్పొరేషన్‌ ఎస్‌ఈగా నియమితులయ్యారు. బదిలీ అయిన వారు తక్షణమే తమకు కేటాయించిన పోస్టింగ్‌లలో విధులకు హాజరు కావాలని పురపాలకశాఖ ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement