Friday, May 3, 2024

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య.. ఘట్‌కేసర్​లో ఘటన

ఘట్‌కేసర్‌, ప్రభన్యూస్‌: రైలు కిందపడి ఓ గుర్తుతెలియని ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యంనంపేట్‌ రైల్వే బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని యువతీయువకుడు శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ నుండి బయలుదేరిన కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి జేబులో దొరికిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా హబ్సిగూడకు చెందిన కుంచెం సాయికుమార్‌గా రైల్వే పోలీసులు గుర్తించారు. యువతికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. మహిళ మెడలో నూతన పసుపుతాడు ఉన్నదని, ఇటీవల వివాహం చేసుకున్న ప్రేమజంట అయి ఉంటుందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

గురువారం రాత్రి ఇక్కడికి చేరుకుని తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్త్తం చేశారు. పూర్తి ఆధారాలు లభించలేదని, మృతులకు సంబంధించిన ఆధారాలు దొరికితేకాని ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయన్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులును సంప్రదించాలని కోరారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే ఎస్‌ఐమజీద్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement