Monday, April 29, 2024

Tragedy: ప‌డ‌వ బోల్తా.. ఇద్ద‌రు గ‌ల్లంతు.. ముగ్గురు సుర‌క్షితం

ప‌డ‌వ బోల్తాప‌డ‌డంతో ఇద్ద‌రు గ‌ల్లంతు కాగా, ముగ్గురు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆచంట మండ‌లం భీమ‌లాపురంలో వ‌శిష్ట గోదావ‌రిలో కొబ్బ‌రికాయ‌ల లోడుతో వెళ్తున్న ప‌డ‌వ బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు గ‌ల్లంతు కాగా.. మ‌రో ముగ్గురు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. గ‌ల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement