Monday, April 29, 2024

సింహాద్రి రీ రిలీజ్.. రెండు మేక‌లు బ‌లి.. 9మంది అరెస్ట్

ఈ మ‌ధ్య‌కాలంలో ప‌లువురు హీరోల పుట్టిన‌రోజుల‌కి ప‌లు సినిమాల‌ని రీ రిలీజ్ చేస్తున్నారు. అదే త‌ర‌హాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్ డేకి సింహాద్రి చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. అయితే ప‌లువురు అభిమానులు అత్యుత్సాహాన్ని చూపించారు. దాంతో వారు క‌ట‌క‌టాల పాల‌య్యారు. సింహాద్రి మూవీ రీ రిలీజ్ రోజున కృష్ణాజిల్లా మ‌చిలీప‌ట్నంలోని రెండు థియేట‌ర్ల వ‌ద్ద అభిమానులు హ‌ల్ చ‌ల్ చేశారు. రెండు మేక‌ల‌ను వేట‌కొడ‌వ‌ళ్ల‌తో న‌రికి వాటి ర‌క్తాన్ని ఎన్టీఆర్ ప్లెక్సీపై చిందించారు. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌ర్ కావ‌డంతో పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. మార‌ణాయుధాలు వినియోగించి..ప్ర‌జ‌ల్ని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశార‌ని వారిపై కేసు న‌మోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement