Sunday, April 28, 2024

 Tragedy: ఏపీలో విషాదం… గోదావరిలో దూకిన న‌వజంట

ఏపీలో విషాధం అలుముకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్లైనా నాలుగు రోజుల‌కే ఓ నవజంట గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గోదావరిలో దూకిన న‌వ‌జంట‌లో వ‌రుడుని స్థానికులు కాపాడ‌గా, న‌వ‌వ‌ధువు మృతి చెందింది.

ఈ నెల 15న కోరాడ సత్యవతి, శివరామకృష్ణ ల వివాహం జరిగింది. అయితే.. ఈ నెల 19వ తేదీన రావులపాలెం లో సినిమా చూసి తిరిగి వస్తుండగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు..చోటు చేసుకున్నాయి. దీంతో సిద్ధాంతం బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకారు నవ వధూవరులు కోరాడ సత్యవతి, శివరామకృష్ణ. అయితే… శివరామ కృష్ణను స్థానికులు కాపాడగా గల్లంతయిన సత్యవతి మృతదేహం ఈ రోజు లభ్యం అయింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement