Thursday, May 9, 2024

Guntur : ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు దుర్మరణం..

ట్రాక్ట‌ర్ బోల్తాప‌డ‌డంలో ఐదుగురు దుర్మ‌ర‌ణం చెంద‌గా, మ‌రో 20మందికి గాయాలైన ఘ‌ట‌న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. అయితే బాధితులంతా కూలీలుగా చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement