Thursday, May 2, 2024

కూలీల ట్రాక్టర్ బోల్తా… నలుగురికి తీవ్ర గాయాలు

కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం ముతరాసిపాలెం స్టేజి వద్ద మామిడి కోతకు కూలీలను తీసుకువెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 18 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. 14 మందిని విసన్నపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement