Friday, May 24, 2024

Tirumala – 26 న ప్రధాని మోడీ తిరుమల కు రాక…

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ pఈ నెల 26 న తిరుమల పర్యటన కు రానున్నారు. అధికారిక సమాచారం ప్రకారం నరేంద్ర మోదీ 26 వ తేదీ సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి కారులో 7 గంటలకు తిరుమల కు చేరుకొని రాత్రి బస చేస్తారు. 27 వ తేదీ ఉదయం 8 గంటలకు తిరుమలేశుని దర్శనం చేసుకుంటారు. ఆపై నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లి ప్రత్యేక విమానం లో తిరుగుప్రయాణం అవుతారు. ఆయన కు స్వాగతం పలకడానికి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి 26 వ తేదీ సాయంత్రం తిరుపతి కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement