Sunday, April 28, 2024

Tirumala: భ‌క్తులు అల‌ర్ట్.. న‌డ‌క‌దారిలో మ‌ళ్లీ చిరుత భ‌యం

భ‌క్తుల‌ను చిరుత భ‌యం మ‌ళ్లీ ప‌ట్టుకుంది. ఇటీవ‌ల కాలంలో అలిపిరి నుంచి తిరుమ‌ల‌కు వెళ్లే న‌డ‌క‌దారిలో చిరుత‌ల సంత‌చారం ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో అలిపిరి న‌డ‌క‌దారిలో చిరుత సంచారం మ‌ళ్లీ శ్రీ‌వారి భ‌క్తుల‌కు భ‌యాందోళ‌న‌కు గురిచేస్తుంది. అలిపిరి మార్గంలో ఉన్న నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచారం స్పష్టంగా భక్తులు చూశారు.

ఇవాళ ఉదయం నాలుగు గంటల సమయంలో చిరుత క‌నిపించ‌డంతో భక్తులందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలోనే టీటీడీ అధికారులు అలాగే అటవీశాఖ అధికారులు అలర్ట్ అయిపోయారు. నడక దారిలో వెళ్లే తిరుమల శ్రీవారి భక్తులను గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగే… వారికి కర్రలు కూడా అప్పగిస్తున్నారు. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement