Monday, May 6, 2024

Tirumala శ్రీవారి సేవలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి

తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నూతన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దర్శించుకున్నారు.. స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.. తిరుమ‌ల‌కు వ‌చ్చిన ఆయ‌న‌కు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో అధికారులు స్వాగ‌తం ప‌లికారు..అనంత‌రం స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు, ఈ సందర్భంగా ఆలయ రంగనాయకుల మండపంలో భట్టి విక్రమార్క కుటుంబానికి పండితులు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి శేషవస్త్రం తో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను, 2024 టీటీడీ డైరీ, క్యాలండర్ ను అందజేశారు..

అనంతరం ఆలయం వెలుపల భట్టి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండాలని కోరాన‌ని తెలిపారు. , రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన అధ్భుతమైన తీర్పును ఇచ్చారని ,తాను నిర్వర్తించే ఆర్థిక శాఖలో ఆర్థిక వనరులు అభివృద్ది చెందేలా కృషి చేస్తానని, పార్టీ పరంగా ఆరు గ్యారింటిలను నేరవేస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement