Sunday, May 5, 2024

AP | రోజాకి టికెట్ కష్టమే.. పృథ్వీరాజ్ కామెంట్స్

వచ్చే ఎన్నికల్లో మంత్రి రోజాకు టిక్కెట్ రావడం కష్టమని జనసేన నేత, సినీనటుడు పృథ్వీరాజ్‌ అన్నారు. ఇవ్వాల (శనివారం) నంద్యాలలోని మహానందిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. చెల్లి, తల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి .. రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 136 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాలు జనసేన – టీడీపీ కూటమికి సాధించడం గ్యారెంటీ అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చారని అన్నారు. ఏపీలో దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికి తాము టీడీపీకి మద్దతిచ్చామని చెప్పారు. రోజా గురించి మాట్లాడి వేస్ట్ అని.. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఆమెకు టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. మంత్రి అంబటి రాంబాబు డిస్ట్రిబ్యూటర్‌గా పనికొస్తారని విమర్శించారు. పోలవరం గేట్ల గురించి కూడా తెలియని అంబటి ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడటం రాష్ట్ర ప్రజలకు అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement