Sunday, April 28, 2024

AP : టిడిపిలో టికెట్ల ర‌చ్చ‌…మార్కెట్ యార్డు మాజీ చైర్మ‌న్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ – జ‌న‌సేన – టీడీపీ పొత్తులో భాగంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అభ్య‌ర్థుల‌కు టికెట్లు ద‌క్క‌లేదు. దీంతో టీడీపీ అభ్య‌ర్థులు బ‌హిరంగంగానే చంద్ర‌బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు.

దీనిలో భాగంగానే న‌ర‌స‌రావుపేట అసెంబ్లీ టికెట్ టీడీపీ నాయ‌కుడు చ‌ద‌ల‌వాడ అర‌వింద బాబుకే ఇవ్వాల‌ని కోరుతూ న‌ర‌స‌రావుపేట మార్కెట్ యార్డు మాజీ చైర్మ‌న్ పులిమి రామిరెడ్డి త‌న ఇంట్లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా అర‌వింద బాబుకే టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ స‌మావేశంలోనే పులిమి రామిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌డి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement