Friday, April 26, 2024

టిక్కెట్ ధ‌ర‌ల వివాధాన్ని సిఎం తో ప‌రిష్క‌రించుకుంటాంం

ఏపీలో గ‌త కొన్ని నెల‌లుగా టిక్కెట్ ధ‌ర‌ల వివాదం కొన‌సాగుతుంది. ఈ విష‌యంపై సిని ప‌రిశ్ర‌మ ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది. ఈ విష‌యం పై ఎపి సిఎం తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా ఈ విష‌యంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో కోర్టుకువెళ్ల‌కుండానే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటామ‌ని నిర్మాత‌లు తెలుపుతున్నారు.

జనవరిలో సంక్రాంతి కానుకగా ‘ఆర్ఆర్ఆర్’తో పాటు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. టికెట్ రేట్లు తగ్గిస్తే వాటికి పెట్టిన బడ్జెట్ కూడా వస్తుందో లేదో అనుమానం క‌లుగుతుంది. ‘ఆర్ఆర్ఆర్’కి దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కింది. టిక్కెట్ ధ‌ర‌లు అలానే ఉంటే నిర్మాత‌లు చాలా న‌ష్ట‌పోతారు అనేది వాస్త‌వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement