Monday, April 29, 2024

వేంప‌ల్లిలో విషాదం – ఈత‌కు వెళ్లి ముగ్గురు దుర్మ‌ర‌ణం..

వైఎస్సార్‌ కపడ జిల్లా వేంపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అలవలపాడులో ఈతకు వెళ్లిగి ముగ్గురు మృతి చెందారు. వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య (25) , సాయి సుశాంత్‌ (8), సాయి తేజ(11)తో పాటు వారి మేనమామ శశికుమార్‌ సరదాగా గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్‌లోకి ఈతకు వెళ్లారు. సాయితేజ, సుశాంత్‌ల అమ్మ మృతి చెందడంతో అలవలపాడులోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. బంధువైన జ్ఞానయ్య సైతం ఈస్టర్‌ పండుగకు వీరి ఇంటికి వచ్చాడు. ముగ్గురితో కలిసి మేనమామ శశికుమార్‌తో కలిసి అందరూ గాలేరు నగరి కాలువలో ఈతకు వెళ్లారు. నీటిలో దిగగా లోతు ఎక్కువగా ఉండటంతో శశికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. మిగతా ముగ్గురు ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న వేంపల్లి ఎస్‌ఐ తిరుపాల్‌ నాయక్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement