Wednesday, May 1, 2024

AP: రోడ్డుప్రమాదంలో.. ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి


ఓ రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉదయం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. కొత్తపేట మండలం మందపల్లి వద్ద పాలవ్యాను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement