Thursday, May 9, 2024

Nellore: ఆటోను ఢీకొట్టిన లారీ : ముగ్గురు మృతి

ఆటోను లారీ ఢీకొన్న ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతిచెందిన విషాధ ఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చిల్లకూరు మండలం చేడిమాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. చింతవరం నుంచి గూడూరు వైపు వెళ్తున్న ఆటోను.. వరగలి క్రాస్‌ రోడ్డు నుంచి చింతవరం వస్తున్న లారీ ఢీకొట్టింది. అనంతరం లారీ ఆటోను కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. గూడూరు సొసైటీ ప్రాంతానికి ఆటో డ్రైవర్ సుధాకర్‌.. ఆటోలోనే ఇరుక్కుని మృత్యువాత పడ్డాడు. మిగిలిన ఇద్దరు లారీ చక్రాల కింద పడి మరణించారు. వీరు గూడూరు మండలం చెన్నూరు దళితవాడకు చెందిన మాతంగి రాజశేఖర్‌, హరిసాయిగా గుర్తించారు. వీరు ఓ ఏజెన్సీలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement