Tuesday, May 14, 2024

Vizianagaram : విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. సంతకవిటి మండలం సోమన్నపేటలో కరెంట్ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన రామినాయుడు ఇంటి నిర్మాణ పనులు చేసేందుకు భవన నిర్మాణ కార్మికులు వచ్చారు. కొత్త ఇంటికి స్లాబ్ నిమిత్తం ఐరన్ రాడ్లను అమర్చే క్రమంలోపట్టుకున్న ఇనుప చువ్వకు ప్రమాదవశాత్తు దగ్గరలో ఉన్న విద్యుత్‌ తీగలకు తగిలింది. వెంటనే ఇద్దరు విద్యుదాఘాతానికి గురయ్యారు.

ఆ వెంటనే ఆ దగ్గరలోనే ఉన్న అంగన్వాడీ ఆయా రియమ్మ వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. కానీ ఆమెకు కూడా కరెంట్ షాక్ తగలింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అయితే కూలి పని కోసం వెళ్లి కేసరి, చంద్రశేఖర్.. వారిని కాపాడే ప్రయత్నంలో అంగన్వాడీ ఆయా రియమ్మ చనిపోవడంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement