Tuesday, May 14, 2024

Big Breaking: జనసేన కార్యకర్తల నుంచి మంత్రులకు ముప్పు.. అలర్ట్​ చేసిన ఇంటెలిజెన్స్​ వర్గాలు

ఆంధ్రప్రదేశ్​లోని 13 మంది మంత్రులకు జనసేన పార్టీ కార్యకర్తల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్​ వర్గాలు అలర్ట్​ చేశాయి. ఈ మేరకు మంత్రుల సెక్యూరిటీని అలర్ట్​ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అర్జీలు, విజ్ఞాపనల పేరుతో వచ్చి దాడికి పాల్పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్​ వర్గాలు హెచ్చరికలు జారీచేయడం ఏపీలో హాట్​ టాపిక్​ అయ్యింది. కాన్వాయ్​ వెళ్తున్నప్పడు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని, దాడులకు దిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి.

మంత్రులు రోజా, జోగిరమేశ్​, ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి, వల్లభనేని వంశి, గ్రంథి శ్రీనివాస్​ వంటి వారితో పాటు పలువురు కాపు నేతలకు కూడా ఇట్లాంటి ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement