Sunday, April 28, 2024

తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీ..

కరోనా రెండో దశ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో, తిరుపతి వెంకన్న స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఆదివారం కావడంతో స్వామి వారిని సన్నిధిలో కోలహలంగా మారింది. నిన్న స్వామివారిని 17,824 మంది దర్శించుకున్నారు. మే నెల రెండో వారంలో సగటున నాలుగు నుంచి 5 వేల మంది వరకూ మాత్రమే భక్తులు స్వామిని దర్శించుకోగా, ఇప్పుడా సంఖ్య మూడు రెట్లకు పైగా పెరగడం గమనార్హం. ఇదే సమయంలో హుండీ ఆదాయం కూడా పెరిగింది. నిన్న హుండీ ద్వారా రూ. 1.83 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో 7,851 మంది తలనీలాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement