Friday, May 17, 2024

Ap Cebinet : ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లును జగవ్ సర్కార్ తీసుకొచ్చింది. 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28న అమలుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్‌కు కెబినెట్ అనుమతి ఇచ్చింది.

►ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్‌ ఆమోదం
►ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి కేబినెట్‌ ఆమోదం
►కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్‌ ఆమోదం
►2024 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు వర్తింపు
►గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement