Monday, April 29, 2024

Tirupathi : గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు… ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

తిరుపతి సిటీ ,, ప్రభ న్యూస్ .. గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు ఏపీపీఎస్సీ వారు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగ‌కుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ. పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, ప్రకాశం భవన్ పరీక్ష కేంద్రాలు వ‌ద్ద గ్రూప్ వన్ పరీక్షలు రాయ‌టానికి .. పలు జిల్లాల నుంచి రానున్నారని వివరించారు. 557 అభ్యర్థులు ఉండ‌గా 429 అభ్యర్థులు హాజరుకానున్నరన్నారు. కాగా 148 మంది అభ్యర్థులు గైహాజరు అయ్యారన్నారు. ఈ కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో భద్రత పరమైన అంశాలను పరీక్షించి పలు సూచనలు ..సలహాలను అందజేశామ‌న్నారు.

విద్యాశాఖ అధికారులు భద్రతపరమైన అంశాలపై తెలియజేశామన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలకు వెళ్లే ముందు వారిని పూర్తిగా తనిఖీ చేసి అనుమతిస్తామ‌న్నారు. ఎలాంటి మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ వస్తువులను అభ్యర్థులు ఇన్ఫ్రిజిరేటర్స్ పరీక్ష కేంద్రాల లోపల.. విధులు నిర్వహించే ఇతర అన్ని శాఖల సిబ్బంది అధికారుల వద్ద కూడా ఉంచుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచుతామ‌న్నారు. పరీక్ష జరుగు సమయాల్లో పరీక్ష కేంద్రాల దగ్గర జిరాక్స్ సెంటర్లు ,,ప్రింటింగ్ సెంటర్లు,, సెల్ ఫోన్ షాపులు ,,ఎలక్ట్రానిక్ సంబంధించిన షాపులు అన్ని మూసివేయిస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement