Sunday, April 28, 2024

Big Breaking | నీళ్లు లేవ్​, ఏసీ వస్తలేదు.. చైన్​ లాగి రైలు నిలిపేసిన ప్రయాణికులు

తిరుపతి జిల్లా గూడూరులో రైలు ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. బరోని–కోయంబత్తూర్​ రైలులో ఇవ్వాల (సోమవారం) సమస్య తలెత్తంది. విజయవాడ దగ్గర నుంచి నీళ్లు రావడం లేదని, ఏసీ బోగీల్లో ఏసీ పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వందల కిలోమీటర్ల దూరం వచ్చినా రైల్వే డిపార్ట్​మెంట్​ ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయం టీటీఈకి చెప్పినా గమ్మునుండిపోయారని గూడూరు వద్ద ప్రయాణికులు చైన్​ లాగి రైలును నిలిపేశారు. ఈ క్రమంలో రైలులో తలెత్తిన టెక్నికల్​ ఇష్యూస్​ పరిశీలించి రిపేర్లు జరిపే పనిలో రైల్వే సిబ్బంది నిమగ్నమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement