Tuesday, May 7, 2024

పీఆర్సీపై ఇచ్చిన జీవోను ర‌ద్దు చేసే ప్ర‌స‌క్తే లేదు : బొత్స స‌త్య‌నారాయ‌ణ

పీఆర్సీపై ఇచ్చిన జీవోను ర‌ద్దు చేసే ప్ర‌స‌క్తే లేద‌ని ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఛ‌లో విజయవాడ కార్యక్రమంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రభుత్వం ఉద్యోగులను ఎక్కడా భయపెట్టలేదని చెప్పారు. ఎవరిపైనా ఒత్తిడి చేయలేదన్నారు. పీఆర్సీ లో కొన్ని సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ఇప్పుడు బయటపెట్టడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేదని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమ‌వుతాయని చెప్పారు. ఇప్పటికీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. రోడ్డెక్కి ఆందోళన చేయడం సరికాదని బొత్స సత్యనారాయణ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement