Thursday, April 25, 2024

రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని మోసం – నిందితుని నుండి 1కోటి, 27 లక్షల రూపాయలు సీజ్

రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసగించిన కేసులో .. అరగొండ గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ ని అరెస్టు చేశారు చిత్తూరు ఒన్ టౌన్ పోలీసులు. హేమంత్ కుమార్ రైల్యేఉద్యోగి నని చెప్పుకుంటూ, ఉన్నతాధికారుల సంతకాలను చేస్తూ , అపాయింట్మెంట్ ఇస్తూ పలువురిని మోసం చేశాడు. కాగా నిందితుని తండ్రి ఇదివరకు రైల్యే ఉద్యోగం చేసేవాడు . ఆ సంబంధాల‌తో ఉద్యోగుల ఇప్పిస్తానని చెప్పి జిల్లాలో పలువురిని మోసం చేశాడు. నిందితుని నుండి 1కోటి, 27 లక్షల రూపాయలు సీజ్ చేశారు పోలీసులు..చిత్తూరు డి ఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ .ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిందితుని మీడియా ముందుకు తీసుకువ‌చ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement