ఏపీలోని ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. టీడీపీ నేతలు ప్రసంగిస్తుండగానే సభా వేదిక కుప్ప కూలింది. ఈ ఘటన ఇవ్వాల (శుక్రవారం) రాత్రి నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో జరిగింది. ఈదురుగాలలు బలంగా వీయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
కాగా, స్టేజీ కూలిన ఘటనలో టీడీపీ ముఖ్య నేతలు చినరాజప్ప, పీతల సుజాత కిందపడిపోయారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.