Sunday, April 28, 2024

AP | పిఠాపురం నుంచే జనసేన ఎన్నికల ప్రచారం..

దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. ఆయా పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారాన్ని పిఠాపురం నుంచి ప్రారంభిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది.

వారాహి వాహనం నుంచి ప్రచారం ప్రారంభిస్తారని, 3 రోజుల పాటు ఆ నియోజకవర్గంలోనే బస చేస్తారని తెలిపింది. కాగా, జనసేన పోటీ చేసే సీటు కావడంతో వైసీపీ అనేక ప్లాన్స్ వేస్తోందని, అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేసినట్లు జనసేన వెల్లడించింది.

ఇక‌, 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నేతతో పాటు ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు లోక్‌సభ స్థానాలపై క్లారిటీ వచ్చేసింది. మిగిలిన 5 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల కోసం తుది దశ కసరత్తు జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement