Monday, April 29, 2024

Boat | రాకాసి అల‌ల‌కు ప‌డ‌వ బోల్తా.. ఇద్ద‌రు మ‌త్స్య‌కారులు గ‌ల్లంతు

స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్లిన వారు రాకాసి అల‌ల‌కు బ‌ల‌య్యారు. ఈ ఘ‌ట‌న శ్రీ‌కాకుళం జిల్లాలో ఇవ్వాల (ఆదివారం) జ‌రిగింది. గారం మండ‌లం బందారువానిపేట‌కు చెందిన ఆరుగురు మ‌త్స్య‌కారులు వేకువ‌జామున వేట‌కు వెళ్లారు. వేట‌సాగిస్తుండ‌గా మ‌ధ్య‌లో రాకాసి అల ఒక్క‌సారిగా వారి ప‌డ‌వ‌ను ముంచేసింది. దీంతో ప‌డ‌వ కాస్త బోల్తాప‌డింది. దీంతో అందులో ఉన్న ఆరుగురు స‌ముద్రంలో ప‌డిపోయారు.

ఇందులో న‌లుగురు వ్య‌క్తులు ఈదుకుంటే క‌ష్టంగా ఒడ్డుకు చేరుకున్నారు. మ‌రో ఇద్ద‌రు మాత్రం గ‌ల్లంత‌య్యారు. వీరికోసం వెతుకుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు. గ‌ల్లంత‌యిన వారిలో పుక్క‌ల్ల ల‌క్ష్మ‌య్య (57), గుంటు గ‌ణ‌ప‌తిరావు (42) ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ స‌మాచారం అందుకున్న గార పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement