Sunday, May 5, 2024

తెలంగాణ‌పై పిటిష‌న్ వేయాల‌ని ఏపీ స‌ర్కార్ నిర్ణ‌యం

విభజనలో జాప్యంపై ఏపీ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. తెలుగు అకాడమీ విభజనపై మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. గతంలో తెలుగు అకాడమీని విభజించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. గత ఏడాది సెప్టెంబ‌రు 14వ తేదీనే తెలుగు అకాడమీని విభజించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే తెలుగు అకాడమీలో రూ.65 కోట్ల కుంభకోణం జరగడంతో విభజన ప్రక్రియ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తెలంగాణ ప్రభుతం బేఖాతరు చేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టు థిక్కరణ పిటిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement