Friday, April 26, 2024

మంత్రాలయానికి చేరిన 52 అడుగుల శ్రీరాముని శిల

మంత్రాలయం, (కర్నూలు) ప్రభన్యూస్‌ : రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రంలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఏర్పాటు- చేయనున్న 52 అడుగుల శ్రీరాముని శిల శనివారం మంత్రాలయానికి చేరుకుంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర సర్కిల్‌లో శ్రీరాముని శిలకు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ, రాఘవేంద్రుని సన్నిధిలో శ్రీరాముని విగ్రహం ఏర్పాటు- చేయడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు.

శ్రీ రాముని భారీ విగ్రహాన్ని బెంగళూరుకు చెందిన అభయ రామ సేవా సమితి ఆధ్వర్యంలో తయారు చేయనుండటం శుభపరిణామమన్నారు. శ్రీరాముడి రాతి శిలకు మంత్రాలయం సర్పంచ్‌ టి.భీమయ్య వైకాపా నాయకులు పూల మాలలు సమర్పించారు. రాఘవేంద్ర సర్కిల్‌ లో శ్రీ రాముని శిలా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మఠం మేనేజర్‌ వెంకటేష్‌ జోషి, ఐ పి నరసింహ మూర్తి, వ్యాసరాజ్‌ ఆచర్‌,వైసీపీ మండల నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement