Thursday, May 2, 2024

AP | తిరుమలలో ఉగ్రవాదులు.. కలకలం సృష్టించిన ఫేక్ న్యూస్

తిరుమల (ప్రభ న్యూస్ బ్యూరో (రాయలసీమ) : తిరుమల క్షేత్రంలో లో ఉగ్రవాదులు ఉన్నట్లు వచ్చిన తప్పుడు సమాచారం కలకలం సృష్టించింది. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్టు పేర్కొంటూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక సమాచారం పోలీసులకు పంపించారు. వెంటనే రంగం లో దిగిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

హటాత్తుగా పోలీసులు తనిఖీలు చేపట్టడం తిరుమలలో చర్చనీయాంశ మైంది. చివరకి పోలీసులకు వచ్చిన మెయిల్ ఫేక్‌ అని తేలడంతో ఆంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై తిరుపతి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పరమేశ్వర రెడ్డి తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవన్నారు. భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవ‌ద్ద‌న్నారు. తిరుమలలో భద్రత పటిష్ఠం గా ఉంది అని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement