Saturday, April 27, 2024

ఏపీ ఫైబర్ నెట్ అవినీతి నిరూపిస్తారా?: వైసీపీకి పట్టాభి సవాల్

ఏపీ ఫైబర్ నెట్‌లో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా నిరూపించాలని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సవాల్ విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఎమ్మెల్సీ లోకేశ్‌ని జైలుకు పంపుతామని వైసీపీ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో పకోడి పేపర్, అవినీతి ఛానల్ ఉన్నాయి కదా అని నోళ్లకు పని చెప్పడం కాదని విమర్శించారు. వైసీపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యముంటే, ఏపీ ఫైబర్ నెట్‌లో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా నిరూపించే సత్తా ఉంటే, తనతో బహిరంగచర్చకు రావాలని పట్టాబి సవాల్ విసిరారు. రూ.149కే కేబుల్, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యాలను చంద్రబాబు అందిస్తే, సీఎం జగన్ దాన్ని రూ.300లకు పెంచారని మండిపడ్డారు. సీఎం జగన్ ఈ రెండేళ్లలో చేసిన అవినీతి, దోపిడీకి ఆయన్ని లక్షసార్లు జైలుకు పంపాలని పట్టాబి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement