Thursday, April 25, 2024

రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు టీడీపీ నేత పట్టాభి

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పట్టాభిని మచిలీపట్నం నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

కాగా, పట్టాభిని గత బుధవారం రాత్రి సూర్యారావుపేట పోలీసులు విజయవాడలో అరెస్టు చేసి తోట్లవల్లూరు పోలీసు స్టేషన్లో ఉంచారు. ఆ తర్వాత గురువారం ఉదయం తోట్లవల్లూరు పోలీసు స్టేషన్‌ నుంచి మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హజరుపరిచారు. విచారించిన న్యాయాధికారి ఏపీపీ వాదనలతో ఏకీభవిస్తూ నవంబర్‌ 2వ తేదివరకు రిమాండ్‌ విధించారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో రాజకీయ వేడి.. ప్రచార బరిలో రేవంత్..

Advertisement

తాజా వార్తలు

Advertisement