Thursday, May 2, 2024

నిరూపిస్తే రాజీనామా చేస్తా: చంద్రబాబుకు మంత్రి అవంతి సవాల్

ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు  చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రకటించారు. లేకపోతే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ఆయన సవాల్ విసిరారు. టీడీపీలో గెలిచి లోకేష్ బాధ తట్టుకోలేక కొందరు ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని పేర్కొన్నారు.  రాష్ట్రంలో 80 శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయో? లేదో ? మీ ఎమ్మెల్యేలను అడిగితే తెలుస్తుందంటూ చంద్రబాబుకు సూచించారు. హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. జగన్‌కు వస్తున్న మంచి పేరు చూడలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. సొంత మామను చంపి పార్టీని చేతులలోకి తీసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని మంత్రి అవంతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అశాంతి, అలజడిని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనయుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారన్న మంత్రి అవంతి.. గంజాయి వ్యవహారం ఇప్పటిది కాదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మంత్రులు గంటా, అయ్యన్న ఒక్కసారి అయిన ఏజెన్సీ వెళ్ళారా అని ప్రశ్నించారు. గంజాయి డాన్ అయ్యన్నను ప్రక్కన పెట్టుకొని చంద్రబాబు గంజాయి కోసం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అవంతి పేర్కొన్నారు.

ఇధి కూడా చదవండి: కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి: పవన్

Advertisement

తాజా వార్తలు

Advertisement