Sunday, April 28, 2024

TDP – 160కి పైగా సీట్లు గెలుస్తాం – ఏపీలో కూట‌మిదే విజ‌యం

మంగ‌ళ‌గిరి – ఈ సార్వ‌త్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 160కి పైగా స్థానాలు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభలో ఎన్డీయే కూటమికి 400కు పైగా స్థానాలు వస్తాయని ఆశాభావం వ్య‌క్తంచేశారు. ఇది నవశకం ఆవిర్భావానికి సంకేతమని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఏపీ ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు.

మ‌రికొన్ని స్థానాల్లో అభ్య‌ర్థులను ప్ర‌క‌టించే చాన్స్‌

మరోవైపు కొంత మంది అభ్యర్థులను నేటి సాయంత్రం చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా టీడీపీ 114 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది. ఇప్పటి వరకు 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. లోక్ సభ అభ్యర్థులను మాత్రం ఇంత వరకు ప్రకటించలేదు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్టు స‌మాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement