Tuesday, April 30, 2024

Breaking: వాగులో టాటా ఏస్ బోల్తా.. నలుగురు చిన్నారులు మృతి

వాగులో టాటా ఏస్ వాహనం బోల్తాపడడంతో నలుగురు చిన్నారులు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కుక్కనూరు మండలం వేలేరు బ్రిడ్జి నుంచి టాటా ఏస్ వాహనం వాగులో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 16మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని బూర్గంపాడు ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement