Tuesday, April 30, 2024

ఉరివేసుకొని తాడిపత్రి పట్టణ సీఐ ఆత్మహత్య

తాడిపత్రి టౌన్ జులై 3 (ప్రభన్యూస్): అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం టౌన్ సిఐ గా విధులు నిర్వహిస్తున్న ఆనందరావు సోమవారం తన నివాసంలో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు కుటుంబ కలహాలు పని ఒత్తిడి కారణమే సమాచారం ఆదివారం రాత్రి సిఐ ఆనందరావు తన భార్యతో గొడవపడి తన బెడ్ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకోవడంతో భార్య పిల్లలు బయట హాల్లో పడుకున్నారు. గతంలో కూడా ఇంట్లో గొడవ పడినప్పుడు ఇలాగే చేసేవాడని తర్వాత తానే వచ్చి తలుపు తీసేవాడని సమాచారం.

అయితే ఎంతసేపు డోరు తెరవకపోవడంతో స్థానికులు సహాయంతో డోర్ బద్దలు కొట్టి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆనందరావు గతంలో కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో విధులు నిర్వహించారు. అక్కడి నుండి గత తొమ్మిది నెలల క్రితం బదిలీలో భాగంగా తాడిపత్రి పట్టణానికి వచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement