Tuesday, May 7, 2024

తదేకం ఫౌండేషన్‌ – జనసేన సేవా కార్యక్రమాలు.. కౌలు రైతు భరోసాకు 5 లక్షల విరాళం..

అమరావతి, ఆంధ్రప్రభ: మహావతార్‌ బాబాజీ స్ఫూర్తితో గురూజీ నౌషీర్‌ ప్రారంభించిన ‘తదేకం ఫౌండేషన్‌’ చేస్తున్న సామాజిక సేవా, సంక్షేమ కార్యక్రమాలు అందరిలో సేవా దృక్పథాన్ని కలిగిస్తున్నందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు, శ్రేణులతో కలసి తదేకం ఫౌండేషన్‌ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలు మహిళలకు, దివ్యాంగులకు ఉపయుక్తంగా ఉన్నాయని చెప్పారు.

వికలాంగులకు టై సైకిల్స్‌ ఇవ్వడంతోపాటు మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి మెషీన్లు అందచేస్తున్నారన్నారు. తదేకం ఫౌండేషన్‌, జనసేన సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమాలను ఫౌండేషన్‌ ప్రతినిధులు మాధవి, సుధ జనసేన పార్టీ అధ్యక్షులకు వివరించి గురూజీ పంపిన సందేశాన్ని అందజేశారు. అనంతరం జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు తమ వంతుగా ఫౌండేషన్‌ తరఫున రూ. 5 లక్షల విరాళం అందజేశారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement