Monday, April 29, 2024

ఎస్వీయూ ఆచార్యులకు జాతీయ అవార్డులు !

SVU అడల్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్లు పి ఆదినారాయణ రెడ్డి, ఎం సి రెడ్డెప్ప రెడ్డి నెహ్రూ జాతీయ అక్షరాస్యతా అవార్డు స్వీకరించారు. ఆదివారం ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు వారికి అవార్డును అందచేశారు. ఇండియన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్  2019 వ సంవత్సరానికి ఆదినారాయణ రెడ్డికి, 2020 సంవత్సరానికి రెడ్డెప్ప రెడ్డి ఈ అవార్డులను ప్రకటించింది. వయోజన విద్యా వ్యాప్తికి వారు చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు ఇచ్చారు. వీరు యూనివర్సిటీలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ అనేక సేవలు అందించారు. తమ పదవీ కాలంలో వయోజన విద్యా వ్యాప్తికి పలు ప్రాజెక్టులను చేపట్టారు. పలు పుస్తకాల రాశారు, పరిశోధనా పత్రాలు సమర్పించారు. అలాగే పలువురు పరి శోధనా విద్యార్థులకు గైడ్లుగా వ్యవహరించారు, వివిధ దేశాలలో పర్యటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement