Tuesday, May 7, 2024

AP: పోలీసు స్టేష‌న్‌లో నిందితుడి అనుమానాస్ప‌ద మృతి.. ఎస్సై, ఇద్ద‌రు కానిస్టేబుళ్ల స‌స్పెన్ష‌న్‌

శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ పోలీస్ స్టేషన్లో నిందితుడి అనుమానాస్ప‌ద మృతి ఆ స్టేష‌న్ ఎస్సై, ఇద్ద‌రు కానిస్టేబుళ్ల మెడ‌కు చుట్టుకుంది. ఈనెల 6వ తేదీన‌ రాత్రి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి అనుమానాస్పదంగా చ‌నిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఆ స్టేష‌న్ ఎస్సై మ‌హ్మ‌ద్ యాసిన్‌, మరో ఇద్దరు సిబ్బందిని సస్పెన్షన్ చేస్తూ జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు.

ఒక కేసులో విచారణకు తీసుకున్న నిందితుడు మురపాక మహేష్ అనుమానాస్పదంగా చ‌నిపోవ‌డ‌మే దీనికి కార‌ణంగా చెబుతున్నారు. మ‌హేశ్ మృతికి సంబంధించి ఎస్సై మహమ్మద్ యాసిస్, రైటర్ పి.లక్ష్మణరావు (హెచ్.సి), మహిళా కానిస్టేబుల్ రాజేశ్వరమ్మను సస్పెండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement