Thursday, May 2, 2024

బ‌స్సు ప్ర‌మాదంలో మృతుల కుటుంబాల‌ను ఆదుకోవాలి : సోము వీర్రాజు

ఏపీలోని చిత్తూరు జిల్లా శేషాచలం ఘాట్‌రోడ్డులో శ‌నివారం అర్ధ‌రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నిశ్చితార్థ వేడుక కోసం వెళ్తున్న బ‌స్సు బస్సు లోయలో పడిపోయింది. పీలేరు – తిరుపతి మధ్య ఉన్న భాకరాపేట ఘాట్‌ రోడ్డులో… సుమారు 100 అడుగుల లోయలో బస్సు పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు 8 మంది అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్యపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రమాద సమయంలో బస్సులో 50 నుంచి 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 40 మందికి గాయాలైనట్లు సమాచారం.

ఈ ఘ‌ట‌న‌పై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు స్పందించారు. 100 అడుగుల లోయలో బస్సు పడి 8 మంది మృత్యువాత పడడం తీవ్ర దిగ్ప్రాంతికి గురిచేసిందని సోము వీర్రాజు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా విడుదల చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement