Thursday, May 2, 2024

KNL: వివాహిత ఆత్మహత్య

కర్నూలు జిల్లా: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఎమ్మిగనూరులో నియోజకవర్గ పరిధిలో గల నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి పరశురాముడు, పార్వతిలకు చెందిన కుమార్తె రేణుక ఇవాళ ఉదయం ఇంటి దగ్గర బాత్రూంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రేణుక భర్త గత ఏడాది మృతిచెందాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. నందవరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement